యాప్నగరం

ఎన్‌ఆర్ఐ పాలసీ: కేరళకు తెలంగాణ ఉన్నతాధికారుల బృందం

Telangana ప్రభుత్వం ఎన్‌ఆర్ఐ పాలసీ రూపొందించనుంది. పాలసీ గురించి అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ కేరళకు పంపించారు.

Samayam Telugu 21 Jan 2020, 6:46 pm
విదేశీ విధానంపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నతాధికారుల బృందం కేరళకు బయల్దేరి వెళ్లింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ అఫైర్స్ (NORKA) పేరుతో కేరళ ప్రభుత్వం అనుసరిస్తోన్న విదేశీ విధానంపై ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేయనుంది.
Samayam Telugu cs


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు రోజుల కేరళ పర్యటన నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు మంగళవారం (జనవరి 21) ఉదయం హుటాహుటిన కేరళ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన కోసం కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోంది. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఎన్‌ఆర్‌ఐ పాలసీపై సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లి అక్కడ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై అధ్యయనం చేస్తున్న కేసీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐల తరపున రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌ఆర్ఐలకు రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై సమగ్ర విధానం రూపొందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేస్తున్న రాష్ర్టాల్లో అధ్యయనం చేయాలని ఉన్నతాధిధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: టీఆర్‌ఎస్ ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకోండి.. అక్బరుద్దీన్ సంచలనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.