యాప్నగరం

ఇంటర్ విద్యార్థులకు ఏమైనా ఫిర్యాదులా..? ఇలా చేయండి

Telangana Inter Board కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను సీరియస్‌గా తీసుకుందని, ఇందులో భాగంగానే తాను బోర్డు కార్యాలయానికి వచ్చానని వివరించారు.

Samayam Telugu 8 Jan 2020, 8:40 am
గతేడాది ఏప్రిల్ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నెలకొన్న గందరగోళంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఆందోళన చెందారో తెలిసిందే. బోర్డు తప్పుల వల్ల తాము పరీక్షల్లో ఫెయిలయ్యామనే భావనతో కొంత మంది విద్యార్థులు ఆవేశంతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. అయితే, ఈసారి ఫలితాల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు బీఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను సీరియస్‌గా తీసుకుందని, ఇందులో భాగంగానే తాను బోర్డు కార్యాలయానికి వచ్చానని వివరించారు.
Samayam Telugu inter board


Also Read: వీడియో: పాతబస్తీలో పోలీసుల తనిఖీలు.. ఆపాలని ఎమ్మెల్యే దబాయింపు

ఫలితాల గందరగోళం సమయంలో గతేడాది నియమించిన త్రిసభ్య కమిటీ చేసిన సూచనలన్నింటినీ అమలు చేస్తున్నట్లు వివరించారు. 0.001 శాతం తప్పులు కూడా తలెత్తకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత ఏడాది జరిగిన తప్పిదాలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి, పీపీటీ కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. దీన్ని జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే లెక్చరర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పరీక్షల పేపర్లు దిద్దే సమయంలో తప్పులు చేస్తే.. సదరు లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి, సీజీజీ డీజీ రాజేంద్ర, ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ ఉమర్‌ అబ్దుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో ఐటీ కంపెనీలు, ఇదే ఏడాదిలో..

BIGRS వెబ్‌సైట్‌లో ఫిర్యాదు విధానం..
ఇంటర్‌ విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైతే www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్‌‌కు లాగిన్ అయ్యి.. ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు రకాన్ని బట్టి దాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. సమస్య పరిష్కారం చేయగానే, పని పూర్తయినట్లు ఫిర్యాదు సమయంలో ఇచ్చిన మొబైల్‌కు మెసేజ్‌ వెళ్తుంది.

Also Read: JBS-MGBS మెట్రో సంక్రాంతికి ముందే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.