యాప్నగరం

అటవీ ప్రాంతంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

ఈ సందర్భంగా డీజీపీకు ఘన స్వాగతం పలికారు అధికారులు. ముందుగా అటవీ పరిశోధన కేంద్రాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.

Samayam Telugu 18 Nov 2020, 11:30 am
గజ్వేల్ అటవీ ప్రాంతంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యటిస్తున్నారు. గజ్వేల్ చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ స్వాగతం పలికారు. గజ్వేల్ .. ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంకు చేరుకున్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.
Samayam Telugu డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన


Read More: GHMC Elections: 30 సీట్లు గెలిస్తే చాలు.. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే!

గజ్వేల్ పర్యటనలో భాగంగా.. ముందుగా ములుగులోని అటవీ పరిశోధన కేంద్రాన్ని ఐపీఎస్‌ అధికారుల బృందం పరిశీలించనుంది. అనంతరం కోమటిబండ రిజర్వ్‌ ఫారెస్టులో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత మర్కూక్‌ కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టును , పంప్‌ హౌస్‌ను , గజ్వేల్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ సమీకృత మార్కెట్‌ యార్డ్‌ను, కోమటి బండ మిషన్‌ భగీరథ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.