యాప్నగరం

మావోయిస్టు చర్యల్ని సమర్థంగా తిప్పి కొడతాం.. డీజీపీ హెచ్చరిక

Telangana DGP: ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు, ఐజీ నవీన్ చంద్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Samayam Telugu 18 Jul 2020, 7:11 pm
మావోయిస్టుల దుశ్చర్యలను తెలంగాణ గడ్డపై జరగనివ్వబోమని డీజీపీ మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయిన హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని అన్నారు. కాబట్టి వారికి ఎవరూ సహకరించకుండా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉండే డాక్టర్లు, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథక రచనతో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను తాము సమర్థంగా తిప్పి కొడతామని తెలిపారు.
Samayam Telugu డీజీపీ మహేందర్ రెడ్డి
Mahender reddy


ఏటూరు నాగారం సబ్ డివిజన్‌లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ములుగు భూపాలపల్లికి చెందిన పోలీస్ అధికారులతో డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడినుంచి పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానించి విద్య, వైద్యం వంటి సదుపాయాలను కలిగి ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు, ఐజీ నవీన్ చంద్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.