యాప్నగరం

తెలంగాణలో 15 మంది డీఎస్పీల బదిలీ

Telangana Police: తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.

Samayam Telugu 14 Nov 2020, 9:25 pm
తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాచిగూడ, బంజారాహిల్స్, సంగారెడ్డి, ఎల్బీనగర్, పఠాన్ చెరు, పంజాగుట్ట, సిద్దిపేట, శంషాబాద్, బాన్సువాడకు కొత్త డీఎస్పీలను కేటాయించారు. ఇంటిలిజెన్స్ డీఎస్పీకి కూడా స్థాన చలనం లభించింది.
Samayam Telugu డీజీపీ మహేందర్ రెడ్డి
Telangana dgp


కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్,
బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్,
సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ,
ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి,
పఠాన్ చెరు డీఎస్పీగా భీం రెడ్డి,
పంజాగుట్ట ఏసీపీగా గణేష్,
సిద్ధిపేట ఏసీపీగా రామేశ్వర్,
శంషాబాద్ ఏసీపీగా భాస్కర్,
బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి,
ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావును బదిలీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.