యాప్నగరం

Liquor Price: మందు బాబులకు షాక్.. లిక్కర్ ధరలు మరింత పెరిగే అవకాశం..!

Liquor Price: తెలంగాణలో మద్యం ప్రియులకు మరో చేదు వార్త చెప్పేందుకు రంగం సిద్ధమైంది. మద్యం ధరలను మరోసారి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. దసరా పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో లిక్కర్‌కు భారీగా డిమాండ్ ఉంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టు ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ధరల పెంపు కోసం డిస్టలరీలు కూడా ఎత్తులు వేస్తున్నాయి. అయితే.. వారి ఎత్తులు ఫలిస్తాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Sep 2022, 8:24 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్
  • తెలంగాణలో మరోసారి పెరగనున్న మద్యం ధరలు..!
  • డిమాండ్‌కు తగ్గట్టు ధరలు పెంచే యోచనలో సర్కార్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Liquor Prices
మద్యం ధరలు పెంపు
Liquor Price: తెలంగాణలో లిక్కర్ రేట్లను మళ్లీ పెంచేందుకు సర్కార్ సిద్దమైందని ప్రచారం జరుగుతోంది. దసరా సందర్భంగా మందు రేట్లు పెంచాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో మద్యం కొరత, మరోవైపు పండగ డిమాండ్‌ని బట్టి.. ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డిమాండ్‌ని బట్టి.. 10 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అటు మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీ (distilleries )లు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. పండగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని.. కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ తర్వాత.. మద్యం ధరలు మూడుసార్లు పెరిగాయి. అయితే.. మద్యం తయారు చేసే డిస్టలరీలకు చెల్లించే ప్రాథమిక ధరను మాత్రం ప్రభుత్వం పెంచలేదు. ఫలితంగా.. పెరిగిన ధరల ఆదాయమంతా ప్రభుత్వానికే వెళ్తోంది. దీంతో బేసిక్‌ ప్రైస్‌ పెంపు కోసం డిస్టలరీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డిస్టలరీల నిర్వాహకులు వారి డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. దసరా సీజన్‌ను ఆసరాగా చేసుకొని.. కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ.. పరిస్థితిని ఎక్సైజ్‌ శాఖ (Excise Department) నిశితంగా పరిశీలించడంతో వారి భాగోతం బయటపడింది.

డిస్టలరీల కృత్రిమ కొరతకు చెక్ పెట్టేందుకు సర్కార్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం మద్యం కొరత లేదు గానీ.. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎక్సైజ్‌ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోందని సమాచారం. అదే సమయంలో డిస్టలరీలు కోరుతున్న విధంగా.. బేసిక్‌ ప్రైస్‌ (Basic Price) పెంచేందుకు శాఖాపరమైన కమిటీని నియమించింది. ధరల పెంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వాలో.. రేపో అందే అవకాశం ఉంది. దాన్ని పరిశీలించాక ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Also Read:
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.