తెలంగాణలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. శుక్రవారం దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరిలో 1,50,02,227 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మరో 1,51,61,714 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా 1,628 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు.
తాజా సవరణలో భాగంగా 2,82,497 మంది ఓటర్లను చేర్చామని వెల్లడించారు. మరో 1,72,255 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. కొత్తగా 2,82,497 మంది ఓటు నమోదు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తాజా సవరణలో భాగంగా 2,82,497 మంది ఓటర్లను చేర్చామని వెల్లడించారు. మరో 1,72,255 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. కొత్తగా 2,82,497 మంది ఓటు నమోదు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి