తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును దోచుకొని, జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి, రాష్ట్రాన్ని పీక్కు తిన్నారని విమర్శించారు. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా వరంగల్లోని మడికొండ వద్ద సందర్శనకు వెళ్లే వాహనాలను కడియం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ విపక్షాలపై మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి నీళ్లను ఆంధ్రులు తరలించుకుపోతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులను కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.
దేశంలో అవినీతిపై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకే అంటూ శ్రీహరి ఎద్దేవా చేశారు. ఏసీబీ, సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర అని, ఆ పార్టీ అంపశయ్యపై ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి చేసిందేం లేదు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తెలంగాణకు ఒరగబెట్టిందేం లేదని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వని బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కే లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణాన్ని అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కడియం శ్రీహరి ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతమంటూ కొనియాడారు.
ప్రపంచంలోని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. 'కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 82 వేల కోట్ల అంచనా వ్యయంలో.. ఇప్పటి వరకు రూ. 53 వేల కోట్లే ఖర్చయ్యాయని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నామని కడియం వివరించారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ విపక్షాలపై మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి నీళ్లను ఆంధ్రులు తరలించుకుపోతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులను కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.
దేశంలో అవినీతిపై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకే అంటూ శ్రీహరి ఎద్దేవా చేశారు. ఏసీబీ, సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర అని, ఆ పార్టీ అంపశయ్యపై ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి చేసిందేం లేదు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తెలంగాణకు ఒరగబెట్టిందేం లేదని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వని బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కే లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణాన్ని అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కడియం శ్రీహరి ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతమంటూ కొనియాడారు.
ప్రపంచంలోని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. 'కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 82 వేల కోట్ల అంచనా వ్యయంలో.. ఇప్పటి వరకు రూ. 53 వేల కోట్లే ఖర్చయ్యాయని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నామని కడియం వివరించారు.