యాప్నగరం

మాధవీలత ఆరోపణలపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ శాఖ స్పందించింది.

Samayam Telugu 2 Sep 2020, 3:39 pm
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే మాధవిలత ఆరోపణలపై తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు స్పందించారు. ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలకి తగిన ఆధారాలు కావాలన్నారు. పోలీస్ అయినా ఎక్సైజ్ అయినా ఆధారాలతో ముందుకు వెళ్తామన్నారు. డ్రగ్స్ కేసు లో ఇప్పటివరకు చాలామందిని అరెస్ట్ చేశామన్నారు. చాలామందిపై తమ నిఘా కూడా ఉందన్నారు. ఐదు ఏళ్ళ క్రితం పార్టీలకు వెళ్ళితే అప్పుడే ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్ విషయంలో ఎక్సైజ్ పోలీసులు కఠినంగా ఉంటామన్నారు. ఆధారాలు లేకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందన్నారు.
Samayam Telugu మాధవీ లత
madhavi latha


టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే.. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని ఆమె పేర్కొంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందని పేర్కొంది. అయితే ఆమె వ్యాఖ్యలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలు ఉంటె తమకు ఇవ్వాలన్నారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేశామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.