యాప్నగరం

అసెంబ్లీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసన సభలో స్పీకర్ జెండా ఎగరేయగా.. మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు.

Samayam Telugu 2 Jun 2020, 11:29 am
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా.. శాసన మండలి వద్ద గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలలను సీఎం నిజం చేశారని.. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు.
Samayam Telugu అంబేద్కర్ చిత్రపటానికి అంజలి ఘటిస్తూ..
telangana assembly speaker pocharam sirinivas reddy and council chairman gutta sukhendar reddy paying tributes to br ambedkar


సీఎం కేసీఆర్ గన్‌ పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్నిఎగురవేశారు. తెలంగా భవన్‌లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జెండాను ఎగురవేశారు. కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.