యాప్నగరం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కరోనాతో మృతి

కరోనా కారణంగా బూర్గుల మృతి చెందారు. దీంతో పలువురు నాయకులు ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Samayam Telugu 18 Jan 2021, 3:24 pm
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కన్నుమూశారు. అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు AISF మాజీ జాతీయ అధ్యక్షుడు అయిన కామ్రేడ్ బూర్గులనర్సింగరావు (89) కొద్దిసేపటి తుది శ్వాస విడిచారు. ఆయన కరోనాతో మృతి చెందారు. ఫ్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొరకు సాగిన ఉద్యమంలో తనవంతు కర్తవ్యంగా సైనికుడిగా నిలబడ్డారని సీపీఐ నారాయణ తెలిపారు. అహర్నిశలు కమ్యూనిష్ట్ ఉద్యమ పురోగతి అభివృద్ధికి కృషి చేశారన్నారు.తమ అందరికీ బూర్గుల పెద్దదిక్కుగా తోడ్పడేవారని అన్నారు. వారి మరణం కమ్యూనిష్ట్ ఉద్యమానికి ప్రగతిశీల ఉద్యమానికి తీరనిలోటన్నారు. వారిమరణంపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారి శ్రీమతి ఆరోగ్యం కూడా క్షీణిస్తుండటం పట్ల నారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu బూర్గుల నర్సింగ్‌రావు
burgula narsing rao death


Read More: హిజ్రాతో యువకుడి వెదవ పని.. అందరు చూస్తుండగానే బూతులు తిడుతూ

మరోవైపు తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదన్నారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల నర్సింగరావు ముందుండి నడిపించారని సీఎం కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.