యాప్నగరం

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఒక్క పూట బడులు అప్పటి నుంచే..!

రాష్ట్రంలో విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తను మోసుకొచ్చింది ప్రభుత్వం. విద్యార్థులకు ఎంతో ఇష్టమైన ఒంటి పూట బడుల కోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఎండలు పెరిగిపోతున్న క్రమంలో.. పిల్లల జాగ్రత్తను దృష్టిలో పెట్టుకుని మార్చి రెండో వారం నుంచి ఒక్క పూట బడిని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సమయంలో స్కూళ్లు.. ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నడిపించాలని పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 16 Feb 2023, 11:52 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
  • మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం
  • ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం 12 వరకు స్కూళ్లు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu students
విద్యార్థులు
తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త వినిపించింది సర్కారు. విద్యార్థులకు ఎంతో ఇష్టమైన ఒక్క పూట బడులకు ముహూర్తం ఖరారు చేసింది. అయితే... ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. రాత్రిపూట చలి చంపేస్తుంటే.. పగలు మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పుడే వేసవిని తలపిస్తున్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బుదులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని మార్చి రెండో వారం నుంచి.. అంటే మార్చి 15 నుంచి ఒక్క పూట బడులు ప్రారంభం అవుతాయని సమచారం. అయితే.. ఈ ఒక్క పూట బడి సమయంలో.. పాఠశాలలు ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నడిపిస్తారు. మరోవైపు.. వేసవి సెలవులను సైతం తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించేసింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 12న యథావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక శివరాత్రి తర్వాత నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు.. ఈసారి ఎండలు బండలు పగిలిపోయేలా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నారు. ఇక మిగతా తరగతుల వారికి ఏప్రిల్ 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని.. సిద్దిపేటలో అంబటిరాయుడు, హీరోనాని
Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.