యాప్నగరం

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక ఆ పేర్లు కనపడవ్..

Telangana Agriculture: నిజానికి ఈ పదాలను ఏ పంట కాలాలకు వాడాలనే అంశంపై సామాన్యులకు కాస్త తికమక ఉంటుంది. కేవలం వ్యవసాయ నిపుణులు, పాత్రికేయులకు మాత్రమే దీనిపై ఎక్కువగా స్పష్టత ఉంటుంది.

Samayam Telugu 25 Apr 2020, 10:26 pm
తెలంగాణలో పంట కాలాలకు వాడే పదాల విషయంలో మార్పు జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంట కాలాలను సూచించే పదాలను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలని సీఎం గతంలోనే భావించారు. ప్రజలకు ఎప్పుడూ తికమకగా ఉండే ఖరీఫ్, రబీ పేర్లను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో ఇక నుంచి వానాకాలం, యాసంగి పేర్లను వాడాల్సి ఉంటుంది.
Samayam Telugu KCR-Muncicipal


Also Read: undefined

ఇకపై శాఖాపరమైన ఉత్తర్వులు, దస్త్రాలు, ఇతర చోట్ల ఖరీఫ్, రబీ కాకుండా యాసంగి, వానాకాలం అనే పదాలను మాత్రమే వాడాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ పదాలనే వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్పొరేషన్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలకు సూచనలు జారీ చేశారు.

Also Read: undefined

ఇప్పటి వరకూ వానాకాలం పంటను ఖరీఫ్ అని.. యాసంగి పంటను రబీ అని పిలుస్తూ వస్తున్నారు. నిజానికి ఈ పదాలను ఏ పంట కాలాలకు వాడాలనే అంశంపై సామాన్యులకు కాస్త తికమక ఉంటుంది. కేవలం వ్యవసాయ నిపుణులు, పాత్రికేయులకు మాత్రమే దీనిపై ఎక్కువగా స్పష్టత ఉంటుంది. తాజాగా ఈ గందరగోళం లేకుండా వానాకాలంలో పండే పంటను వానాకాలం పంట అని, ఎండా కాలం పండే పంటను యాసంగి అని పిలవడం అందరికీ సులభంగా ఉండనుంది.

Also Read: కేసీఆర్ ఆయనకు ఏం శాపం పెడతారో.. విజయశాంతి సెటైర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.