యాప్నగరం

Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ. 550.14 కోట్లు విడుదల

Rythu Bandhu: రైతు బంధు పథకంలో భాగంగా ఇవాళ మరో రూ. 550.14 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) వెల్లడించారు. మెుత్తంగా ఇప్పటి వరకు 62,45,700 మంది రైతుల ఖాతాల్లో రూ.6,351.22 కోట్లను తమ ప్రభుత్వం జమ చేసినట్లు చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 17 Jan 2023, 1:35 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
  • రైతు బంధు నిధులు విడుదల
  • అన్నదాతల ఖాతాల్లోకి రూ. 550.14 కోట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rythu Bandhu funds
రైతు బంధు నిధులు విడుదల
Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు పథకంలో భాగంగా ఇవాళ మరో రూ.550.14 కోట్ల నిధులు విడుదల చేసింది. 11 లక్షల 306.38 ఎకరాలకు గాను 1,60,643 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యేలా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) వెల్లడించారు. మెుత్తంగా ఇప్పటి వరకు 62,45,700 మంది రైతుల ఖాతాల్లో రూ.6,351.22 కోట్లను తమ ప్రభుత్వం జమ చేసినట్లు మంత్రి వివరించారు. తమ ప్రభుత్వ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

ఇక రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ గురించి ప్రస్తావించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. బీఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా ఖమ్మం సభ నిలవనుందని చెప్పారు. ఈ సభలో పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశామలం కావాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పారు. నాడు తెలంగాణ కోసం నేడు దేశం ముందడుగు వేశారని వెల్లడించారు. ఖమ్మంలో రేపు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మం కాబోతుందని జోశ్యం చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అవినీతి పాలనను ఎండగడతామని చెప్పారు. అన్ని రంగాలను ప్రవేటు పరం చేస్తూ అమ్మేస్తున్న కేంద్రం కన్ను ప్రస్తుతం ఆహార రంగంపై పడిందని నిరంజన్ రెడ్డి ఆరోపిచారు. కేసీఆర్ నాయకత్వంలో తాము కేంద్రం కుట్రలను చేధిస్తామని చెప్పకొచ్చారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో బీజేపీ వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. అందుకే తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ నిధులు, రుణాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యనించారు. రానున్న ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ తనదైన ముద్ర వేస్తుందని నిరంజన్ రెడ్డి జోశ్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పాతరేసి అధికారంలోకి వస్తామని చెప్పారు.
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.