యాప్నగరం

Good News: పెద్దోళ్లకి కేసీఆర్ శుభవార్త.. బంపరాఫర్

సీఎం కేసీఆర్ మరో వరం ప్రకటించారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు గుడ్‌న్యూస్ చెప్పారు. సోమవారం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Samayam Telugu 9 Oct 2021, 10:25 pm
దళిత బంధు పథకంతో ప్రతిపక్షాలను ఇరకాటంలో నెట్టేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మరో పథకం ప్రకటించారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు వృద్ధులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త పింఛన్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న పెద్దోళ్లకి శుభవార్త అందించారు. నూతన పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. యాభై ఏడేళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలియజేసింది. వచ్చే సోమవారం 11 వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి ఏళ్లుగా సందిగ్ధత నెలకొంది. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకపోయింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వేలాది మంది వృద్ధులకు ప్రయోజనం కలగనుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.