యాప్నగరం

మూసీ నదికి శాంతి పూజలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

మూసీ నదికి వరద పోటెత్తింది. చెరువులన్నీ నిండుకున్నాయి. పొంగిపొర్లాయి. వందలాది కాలనీల్లో వాన నీరు చేరింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇంకా వరద తగ్గుముఖం పట్టకపోవడంతో మూసీ నదికి శాంతి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Samayam Telugu 21 Oct 2020, 10:39 am
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద ప్రవాహం అమాంతం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. మూసీ నదికి భారీగా వరద చేరింది. దీంతో మూసీ నదికి శాంతి పూజలు చేయడానికి సిద్దమయింది తెలంగాణా ప్రభుత్వం. ఈరోజు మధ్యాహ్నం 12-00 గంటలకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మూసీ నది మీద ఉన్న పురానాపూల్ కమాన్ వద్ద పూజలు నిర్వహించనున్నారు.
Samayam Telugu మూసీ నదికి శాంతి పూజలు
musi river


హైదరాబాద్ కు చెందిన మంత్రులు మూసీ నదికి శాంతిపూజ చేస్తారు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు,పసుపు, కుంకుమ, పూలు సమర్పించనున్నట్లు చెబుతున్నారు. 1908 లో మూసి కి వచ్చిన భారీ వరదతో లక్షలాదిమంది నిరాశ్రయులై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆరోజున కూడా పండితుల సూచనలు మేరకు నాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కూడా మూసి కి శాంతి పూజలు చేసి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఆ తర్వాత మూసీ నది శాంతించిందని చెబుతున్నారు.

Read More: తెలంగాణ కొత్త సచివాలయానికి రెండే రెండు టెండర్లు

మూసీనదికి 1908లో వచ్చిన వరదలు తీవ్ర నష్టం కల్గించాయి. సెప్టెంబర్ 26 నుండి 28వరకు వరదలు బీభత్సం సృష్టించాయి. 36 గంటల్లో 16 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతంతో దాదాపు 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.నగరంలో ఉన్న మూడు వంతెనలు అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ తెగిపోవడంతో, పూరానాపుల్ వంతెన మాత్రమే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య అనుసంధానమైవుంది. అప్పటి నిజాం నవాబు తన సంస్థానాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించాడు. తాజాగా మరోసారి మూసీకి భారీ వరదలు వచ్చాయి. కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చినందున అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి శాంతి పూజ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.