యాప్నగరం

తెలంగాణలో Zero FIR.. మహిళలకు పెప్పర్ స్ప్రే.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు

Zero FIR: తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం కొన్ని సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Samayam Telugu 5 Dec 2019, 11:25 am
దిశా ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని తీసుకురానున్నారు. అంటే బాధితుల నుంచి ఏదైనా నేరం తాలూకూ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బుధవారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం భద్రతపరమైన వాతావరణం ఏర్పర్చే ప్రయత్నాల్లో భాగంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలివీ...
Samayam Telugu ali


Also Read: దిశపై అభ్యంతరకర పోస్టులు.. గుంటూరులో యువకుడి అరెస్టు

అన్ని పోలీస్ స్టేషన్‌లలో జీరో ఎఫ్ఐఆర్‌తో పాటు.. బడిలో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నైతిక విలువలు బోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. గతంలో నేరం చేసి బయట తిరుగుతున్న నేరస్థులపై నిఘా ఉంచేందుకు పంచాయతీ కార్యదర్శుల సాయం తీసుకోవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. షీ టీమ్‌లను మరింత బలోపేతం చేయనున్నారు. అలాగే మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సాయపడే హాక్‌ఐ యాప్‌ను మరింతగా అఫ్‌డేట్ చేసి సులభంగా వాడేలా తీర్చిదిద్దుతారు.
ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 100, 181, 1098, 112 , ఇతర రక్షణ యాప్‌లపై బాలికలు, యువతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అన్ని కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, వివిధ సంస్థల నోటీసు బోర్డులు, ప్రజా రవాణా వాహనాలులోనూ వాటిని ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటారు. భద్రతపై మహిళలను చైతన్యపరిచేందుకు ఈ-లెర్నింగ్‌ కోర్సులు ఆరంభింస్తారు. ఇంకా మహిళల భద్రత కోసం ప్రకటనలను రూపొందించి టీవీలు, సినిమా హాళ్లలో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Also Read: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు.. పవిత్రమైన పేరును తప్పుగా వాడారని..

పాఠశాలల తరపున ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు క్రమం తప్పకుండా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తుండాలి. విద్యార్థుల ప్రవర్తనను గుర్తించి తల్లిదండ్రులకు చేరవేస్తుండాలి.
సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, పోలీసు కమిషనర్లు, అదనపు డీజీలు, ఐజీలు పాల్గొన్నారు.

Also Read: అమ్మాయిలంటే అంత చులకనా.. చిలుకూరు అర్చకులు రంగరాజన్ ఆవేదన

మెట్రోలో పెప్పర్ స్ర్పేలకు అనుమతి..
హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ మహిళలు, యువతులు ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేలను తమతో ఉంచుకొనేందుకు అనుమతించారు. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దిశా ఘటన జరిగాక పెప్పర్ స్ప్రేలను తమతో ఉంచుకోవచ్చని సోమవారం తొలిసారి బెంగళూరు మెట్రో ప్రకటించింది.

Also Read: సైకిల్‌పై పాల వ్యాపారం చేశా.. సక్సెస్‌కు నేనే నిదర్శనం: మంత్రి మల్లారెడ్డి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.