యాప్నగరం

TSPSC: పేపర్ లీకేజీపై గవర్నర్ సీరియస్.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై గవర్నర్ తమిళసై సీరియస్ అయ్యారు. దీనిపై 48 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 Mar 2023, 10:13 pm
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ సౌందరరాజన్ తమిళిసై సీరియస్‌గా స్పందించారు. ప్రశ్నప్రతం లీకేజీ వ్యవహారంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు. ప్రశ్నపత్రం లీకేజీని తీవ్రంగా పరిగిణించిన గవర్నర్‌ తమిళసై.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు కూడా ప్రతిపాదించాలని సూచించారు.
Samayam Telugu గవర్నర్ తమిళ సై (ఫైల్ ఫొటో)


కాగా, టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 9 మంది నిందితులను బేగంబజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. విచారించిన న్యాయమూర్తి 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరో వైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ నగర కమిషనర్ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.