యాప్నగరం

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: గవర్నర్ తమిళిసై

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు తమిళిసై. అనంతరం ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు.

Samayam Telugu 15 Mar 2021, 1:09 pm
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగులో ఆమె ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారుతోందన్నారు. రైతు బంధుతో పెట్టుబడి సాయం ఇచ్చామన్నారు. రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలిచామన్నారు. మున్సిపల్, రెవెన్యూ చట్టాల్లో సమూల మార్పులు చేశామన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని గవర్నర్ కొనియాడారు.
Samayam Telugu telangana governor tamilisai soundar rajan speech in assemly
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: గవర్నర్ తమిళిసై


తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందన్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. ఆరుదశబ్ధాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందన్నారు. సంక్షేమానికి తెలంగాణ పెద్ద పీట వేస్తుందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయన్నారు. కరోనా రికవరీ కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రం త్వరగా బయటపడిందన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లు చాలా కష్ట పడ్డారన్నారు తమిళిసై.

విద్యుత్ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాధించామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తెలంగాణవ్యాప్తంగా మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరింది. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో 57.26లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీటి సౌకర్యం అందుతోంది అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.