యాప్నగరం

ఉప రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Telangana నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమిళిసై సౌందర రాజన్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Samayam Telugu 16 Sep 2019, 3:53 pm
తెలంగాణ నూతన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తమిళిసై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం వెంకయ్య నాయుడి నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం అందిచారు. తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా వెంకయ్య నాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్ర హోంమంత్రిని కూడా తమిళిసై కలవనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Venkaiah Naidu


కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1న ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్‌లను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌ను నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా సెప్టెంబర్ 8న తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

మొన్నటివరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించపోవడంతో ఆయన చెన్నైకి వెళ్లిపోయారు. మరోవైపు తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను కేంద్రం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ బాధ్యతలు అప్పగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.