యాప్నగరం

ఏపీలో తెలంగాణ గవర్నర్ పర్యటన... శ్రీవారి సేవలో తమిళిసై

కాణిపాకంలో వినాయకుడ్ని దర్శించుకొని అనంతరం తిరుమల చేరుకున్నారు. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో కూడా ఆమె ఇవాళ పాల్గొంటారు.

Samayam Telugu 24 Jan 2021, 9:44 am
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిలీసై సౌందర్ రాజన్. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందగా ఉందన్నారామె. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. అనంతరం గర్నవర్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Samayam Telugu తెలంగాణ గవర్నర్ తమిళిసై


అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కాణిపాకం వెళ్లి వరసిద్ధి వినాయకుని దర్శించుకొని, రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన మోదీకి,డాక్టర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్ ధన్యావాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.

Read More
: కేటీఆర్ టీంలోకి పొంగులేటి... కీలక పదవి దక్కనుందా?

గవర్నర్ తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల గోల్డెన్‌జూబ్లీ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, శ్రీకాళహస్తి చేరుకుంటారు. సాయంత్రం 6.25 గంటలకు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.