యాప్నగరం

నిమ్స్‌ను సందర్శించిన గవర్నర్.. డాక్టర్లకు కరోనా టెస్టులపై కీలక సూచన!

రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 79 మంది వైద్యులు కరోనా బారిన పడిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు.

Samayam Telugu 8 Jun 2020, 12:41 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు. నిమ్స్‌ వైద్య సిబ్బంది ఇటీవల కరోనా బారిన పడిన నేపథ్యంలో వారికి అందుతున్న వైద్యంపై ఆమె ఆరా తీశారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యాధికారులతో ఆమె చర్చించారు. డాక్టర్లకు కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని కోరతానని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
Samayam Telugu గవర్నర్ తమిళిసై
tamilisai soundararajan


రెండు వారాల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో 79 మంది ప్రభుత్వ వైద్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తగిన రీతిలో టెస్టులు చేయడం లేదని వైద్య సిబ్బంది ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సమయంలో.. డాక్టర్లకు కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని గవర్నర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 49 మంది, నిమ్స్‌లో 26 మంది, గాంధీ మెడికల్ కాలేజీలో నలుగురు చొప్పున కరోనా బారిన పడ్డారు. మరోవైపు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో గాంధీ హాస్పిటల్‌ పేషెంట్లతో నిండిపోయింది. దీంతో నిమ్స్‌ను కరోనా స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.