యాప్నగరం

జర్నలిస్టులకు ఆ పని అలవాటే, అనుమతివ్వండి.. ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు

TS High Court: ఇప్పటికే కోవిడ్ బులిటెన్ తప్పుల తడకగా ఉంటోందని పిటిషనర్ హైకోర్టుకు చెప్పారు. జీ బ్లాక్ కింది సొరంగంలో నిధులు ఉన్నాయని వార్తలు వచ్చాయని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Samayam Telugu 24 Jul 2020, 2:53 pm
తెలంగాణ సచివాలయ కూల్చివేతపై మీడియా కవరేజీకి అనుమతించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు వరుసగా మూడో రోజు విచారణ జరిపింది. కూల్చివేతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు బులెటిన్ రూపంలో ప్రకటన విడుదల చేయాలని గురువారం నాటి విచారణలో హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. కరోనా హెల్త్ బులెటిన్స్‌లాగే కూల్చివేతలపై కూడా రోజువారిగా విడుదల చేయాలని సూచించింది. దీనిపై శుక్రవారం అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం సమాచారం ఇస్తుందని తెలిపారు. కోవిడ్-19 బులిటెన్ ఇచ్చినట్లుగానే కూల్చివేతకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Samayam Telugu telangana govt accepts to release special bulletin on secretariat demolishing
జర్నలిస్టులకు ఆ పని అలవాటే, అనుమతివ్వండి.. ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు


దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే కోవిడ్ బులిటెన్ తప్పుల తడకగా ఉంటోందని హైకోర్టుకు చెప్పారు. అంతేకాకుండా జీ బ్లాక్ కింది సొరంగంలో నిధులు ఉన్నాయని వార్తలు వచ్చాయని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఇందుకు ఏజీ స్పందిస్తూ.. భవనాలు, నిర్మాణ పనుల నిబంధనలు-180 ప్రకారం పని చేసే వారు తప్ప మరెవరూ ఆ ప్రదేశంలో ఉండకూడదని ఏజీ మరోసారి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు జర్నలిస్టులకు రిస్క్ చేయడం అలవాటే కదా? అని వ్యాఖ్యానించింది.

అంతేకాక.. వార్ జోన్, మావోయిస్టు వార్తల కవరేజ్‌లో ఎంతో కష్టమైనప్పటికీ జర్నలిస్టులు వెళ్లారని కోర్టు ఉదహరించింది. ఇలాంటివెన్నో చూసిన జర్నలిస్టులకు సెక్రెటేరియట్ కూల్చివేత కవరేజ్‌ ఇబ్బంది కాబోదని, అనుమతి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా.. మీడియాను తీసుకెళ్లి కవర్ చేసి పంపించవచ్చని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఇందుకు స్పందించిన ఏజీ.. ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి నిర్ణయం చెబుతామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే మధ్యాహ్నం ఏజీ ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.