యాప్నగరం

Ibrahimpatnam: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఘటనలో కీలక మలుపు

Ibrahimpatnam Hospital: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన కీలక మలుపు తిరిగింది. సస్పెన్షన్ వేటుకు గురైన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రికి తాను తాత్కాలిక ఇంఛార్జ్‌ని మాత్రమేనని, నాటి ఘటనతో తనకు సంబంధం లేదని అంటున్నారు. ఆగస్టు 25న (ఘటన జరిగిన రోజు) తాను సీఎం కేసీఆర్ కార్యక్రమంలో ఉన్నానని తెలిపారు. తాను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తానని ఆయన చెప్పారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 25 Sep 2022, 12:36 am
బ్రహీంపట్నంలో (Ibrahimpatnam Hospital) సంచలనం సృష్టించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన కీలక మలుపు తిరిగింది. సస్పెన్షన్ వేటుకు గురైన ఆస్పత్రి సూపరింటెండెంట్.. హైకోర్టును ఆశ్రయించారు. ఆసుపత్రికి తాను తాత్కాలిక ఇంఛార్జ్‌ని మాత్రమేనని చెబుతున్నారు. నాటి ఘటనతో తనకు సంబంధం లేదని అంటున్నారు. తాను ఆస్పత్రి ఫండ్స్ ఇంఛార్జ్‌ని మాత్రమేనని తెలిపారు. ఆగస్టు 25న (ఘటన జరిగిన రోజు) తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. నాడు కొంగరకలాన్‌లో నూతన కలెక్టరేట్ భవన సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోలో ఉన్నానని తెలిపారు. తాను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తానని ఆయన వెల్లడించారు. తన సస్పెన్షన్‌పై ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డాక్టర్ శ్రీధర్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.
Samayam Telugu Ibrahimpatnam Family planning operation
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్


ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు 25న ఒక గంట వ్యవధిలోనే 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. శస్త్ర చికిత్స వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసింది.

కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీపై బదిలీ వేటు వేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పలు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌పై బదిలీ వేటు వేయడంతో పాటు మరో 13 మంది హెల్త్ సిబ్బందిపై చ‌ర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంప‌ట్నం ఆస్పత్రి డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ గీత, హెడ్ నర్స్ చంద్రకళ, మాడుగుల ప్రైమెరీ హెల్త్ సెంట‌ర్ డాక్టర్ శ్రీనివాస్, సూపర్‌వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ ప్రైమరీ హెల్త్ సెంట‌ర్ డాక్టర్ కిర‌ణ్‌తో పాటు ఇతర సిబ్బంది జయలత, పూనం, జానకమ్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.