యాప్నగరం

తెలంగాణ పది పరీక్షలు మళ్లీ వాయిదా.. కోర్టు తీర్పు వేళ సంచలన నిర్ణయం

Sabitha Indra Reddy: జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయం.

Samayam Telugu 6 Jun 2020, 8:50 pm
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా మినహా మిగతా రాష్ట్రమంతా పది పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ప్రకారం.. పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. అందువల్లే పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి (మే 6) ప్రకటించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
exams


జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయం. పదో తరగతి పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి శనివారం ప్రకటించారు.

పది పరీక్షల నిర్వహణపై ఆదివారం సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకుంటారు. పబ్లిక్ పరీక్షలు లేకుండా.. ప్రీ ఫైనల్‌ పరీక్షల ఆధారంగా గ్రేడ్‌‌లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. శనివారం నాటి హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Must Read: వనపర్తిలో కొత్త రకం వైరస్ విజృంభణ.. బెంబేలెత్తుతున్న జనం

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.