యాప్నగరం

అనాథాశ్రమంలో చిన్నారిపై రేప్: సర్కారు సీరియస్.. వారికి మూడినట్లే!

Ameenpur Girl News: అనాథ శరణాలయానికి నిధులిచ్చే నెపంతో వేణుగోపాల్‌ రెడ్డి అనే 54 ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చి, బాలికకు మాయమాటలు చెప్పి చాలాసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.

Samayam Telugu 14 Aug 2020, 12:07 am
సంగారెడ్డి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమశాఖ నలుగురు సభ్యులుతో ఓ కమిటీ వేసింది. ఆగస్ట్‌ 20లోపు ఈ అత్యాచార ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాక, తక్షణ చర్యల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని మారుతి అనాథాశ్రమం అనుమతులను రద్దు చేసింది. అందులో ఉన్న అనాథ పిల్లలను మరో అనాథాశ్రమానికి తరలించాలని ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
man rapes girl


సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథాశ్రమంలో అత్యంత దారుణమైన రీతిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనాథ శరణాలయానికి నిధులిచ్చే నెపంతో వేణుగోపాల్‌ రెడ్డి అనే 54 ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చి, బాలికకు మాయమాటలు చెప్పి చాలాసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు ఆశ్రమ నిర్వహకులు విజయ, జయదీప్‌ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు అత్యాచారం కారణంగా బాలికకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ రావడంతో ఆమెను నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది.

Also Read: undefined

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన ఆ బాలికకు తల్లిదండ్రులు మరణించారు. దీంతో బాలిక బంధువులు అమీన్‌పూర్‌ పరిధిలోని మారుతి అనాథాశ్రమంలో చేర్పించారు. బాలిక అక్కడే అయిదో తరగతి వరకూ చదువుకుంది. ఏటా సెలవుల్లో కొన్నిరోజుల పాటు దూరపు బంధువుల ఇంట్లో ఉంటుండేది. బాలిక బాత్‌రూమ్‌లో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ఆశ్రమ నిర్వహకులు బాలిక బంధువులకు ఫోన్ చేశారు. అలా ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.

Also Read: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్

అప్పటికే బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు చికిత్స చేయించారు. మళ్లీ గత నెల 29న అనాథ ఆశ్రమంలో చేర్చేందుకు తీసుకెళ్లారు. ఈసారి ఆమెను చేర్పించుకునేందుకు ఆశ్రమ నిర్వహకురాలు విజయ ఒప్పుకోలేదు. దీంతో బాలికను మరో బంధువు తన ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితిపై అనుమానం వచ్చి బంధువులు గట్టిగా ప్రశ్నించడంతో తనపై జరిగిన అకృత్యాలను ఆ బాలిక బయటపెట్టింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అప్పుడు బంధువులు గత నెల 31న బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి, ఆశ్రమ నిర్వహకులు విజయ, జయదీప్‌‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Must Read: రాత్రంతా వానలోనే కొడుకు శవం, ఉదయానికి తల్లి మృతి.. అక్కడ తీవ్రంగా కరోనా భయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.