యాప్నగరం

మహారాష్ట్ర నుంచి వస్తే.. ఈ పరిస్థితి తప్పదు!

మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి తిరిగొస్తున్న వారికి థర్మల్ స్క్రీనింగ్ చేపట్టడంతోపాటు వారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.

Samayam Telugu 9 Jun 2020, 11:10 am
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తారాస్థాయికి చేరాయి. చైనా కంటే ఎక్కువగా కోవిడ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... పొరుగున ఉన్న తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బోధన్ సమీపంలోని సాలూర చెక్ పోస్టు వద్ద చెక్ పోస్టు వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చే వారి వివరాలను సేకరించడతోపాటు.. వారికి థర్మల్ స్క్రీనింగ్ చేపట్టి.. చేతికి హోంక్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.
Samayam Telugu నమూనా చిత్రం
thermal screening


ముంబై పరిసర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగొచ్చిన వారిని కూడా ఇప్పటికే హోం క్వారంటైన్లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వలస కూలీల్లో చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.