యాప్నగరం

తెలంగాణలో 100కు పైగా కరోనా హాట్ జోన్లు.. అక్కడ కీలక వ్యూహం

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న జిల్లాల్లో మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్. నిత్యావసర సరకులు కూడా ఇంటికే.. 100కు పైగా కరోనా హాట్ జోన్లను గుర్తించినట్లు సమాచారం.

Samayam Telugu 8 Apr 2020, 2:49 pm
రోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసే యోచనలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 400 దాటాయి. తెలంగాణలో మొత్తం 100కు పైగా కరోనా క్లస్టర్లను గుర్తించినట్లు సమాచారం. ఏప్రిల్ 14 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తేసినా రాష్ట్రంలో మరో వారం లేదా పది రోజుల పాటు కొనసాగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలా చేయకపోయినా.. ఈ హాట్ జోన్లలో మాత్రం పూర్తి స్థాయిలో నిర్బంధం కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Samayam Telugu state


ఈ హాట్ జోన్లలో ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసే అవకాశం ఉంది. నిత్యావసర సరకుల కోసం కూడా ప్రజలను అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. ఇందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరకులను ఇంటింటికీ సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కరీంనగర్‌లో ఇదే విధానాన్ని అమలు చేసి సత్ఫలితాలు పొందారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరకుల దుకాణాలను కూడా మూసివేయించారు. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కరోనా కేసులు అధికంగా ఉన్నాయి.

కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేసియన్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వెంటనే మార్చి మూడో వారంలో నగరంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించారు. కరోనా కట్టడి కోసం కఠినమైన వ్యూహాన్ని అమలు చేశారు. తద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. అదే పద్ధతిని మిగతా చోట్ల కూడా అనుసరించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: నగరంలో అర్ధరాత్రి పోలీస్ బాస్‌ల సుడిగాలి పర్యటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.