యాప్నగరం

తెలంగాణలో భూముల విలువ పెంపు.. జీవో జారీ, ఎల్లుండి నుంచే..

Telangana Govt: వ్యవసాయ భూముల కనిష్ఠ విలువ ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదే ఓపెన్‌ ప్లాట్ల కనిష్ఠ విలువ చదరపు గజానికి రూ.200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Samayam Telugu 20 Jul 2021, 6:44 pm
తెలంగాణలో ఎల్లుండి (జులై 22) నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల ప్రభుత్వ విలువను 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక, 6 నుంచి 7.5 శాతానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కూడా పెంచింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ 50 శాతం పెరగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో నెంబర్ 58ని విడుదల చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Telangana government


వ్యవసాయ భూముల కనిష్ఠ విలువ ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదే ఓపెన్‌ ప్లాట్ల కనిష్ఠ విలువ చదరపు గజానికి రూ.200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓపెన్ ప్లాట్లు తక్కువ పరిధిలోనివి 50 శాతం, మిడ్ రేంజ్‌లోని ఉన్నవి 40 శాతం, హైరేంజ్‌లోని ప్లాట్ల ధరలు 30 శాతం మేరకు పెరిగాయి. అపార్ట్‌మెంట్లకు సంబంధించి అతి తక్కువ విలువ ఒక చదరపు అడుగు రూ .800 ఉండగా.. దాన్ని రూ.1000 చేశారు. తెలంగాణలో భూముల విలువ పెంపు ఈనెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.

ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో భూముల ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే రాష్ట్ర ఖజానా నిండుకోవడమే కాకుండా రియల్ ఎస్టేట్‌లో బ్లాక్ దందాకు కూడా చెక్ పడుతుంది. దీనితోనే కేసీఆర్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగ్గా.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్ విలువలు కూడా పెరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.