యాప్నగరం

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. మెట్రో రైళ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Telangana Unlock 4: కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యల కోసం అనుసరించాల్సిన ప్రోటోకాల్‌లపై చర్చించేందుకు మంగళవారం దేశంలోని అన్ని మెట్రో సంస్థల ఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.

Samayam Telugu 2 Sep 2020, 5:34 pm
గత ఐదున్నర నెలల నుంచి డిపోలకే పరిమితమైన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రయాణికులతో పట్టాలపై పరుగులు తీయనున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను విడతల వారీ పద్ధతిలో మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్-4లో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో మెట్రో రైళ్లకు కూడా అనుమతించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad metro rail


ఈ క్రమంలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యల కోసం అనుసరించాల్సిన ప్రోటోకాల్‌లపై చర్చించేందుకు మంగళవారం దేశంలోని అన్ని మెట్రో సంస్థల ఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ ప్రోటోకాల్స్ ఒకటి లేదా రెండు రోజుల్లో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ ఆమోదంతో నిర్ణయించే అవకాశం ఉంది.

కేంద్రం నిర్దేశించిన ఈ ప్రోటోకాల్స్‌ను మెట్రోలో అందరూ తప్పనిసరిగా, విధిగా పాటించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సరైన శానిటైజేషన్‌ విధానాన్ని అనుసరించడానికి, మెట్రో రైళ్లు, స్టేషన్లలో సామాజిక దూరాన్ని కొనసాగించడానికి.. తగినంత వెంటిలేషన్, రైళ్లలోకి ఎక్కువ స్వచ్ఛమైన గాలిని పంపింగ్ చేయడం, ఎయిర్ కండిషనింగ్ మెకానిజం మెరుగుపరచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటివి ఈ ప్రోటోకాల్స్‌లో ఉండే అవకాశం ఉంది.




Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.