యాప్నగరం

కరోనా వేళ.. హైదరాబాద్‌లో 32 ప్రత్యేక బస్సులు

Hyderabad Lockdown News: లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేసేందుకు అనుమతించింది.

Samayam Telugu 22 May 2020, 11:17 pm
హైదరాబాద్‌లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ప్రత్యేకంగా నగరం నలుమూలలకు బస్సులను నడపనున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు. అయితే, ఈ బస్సుల్లోకి ఎక్కాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. అయితే, లోనికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని 32 రూట్లలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad city buses


లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేసేందుకు అనుమతించింది. ఆయా కార్యాలయాల్లో పని చేసేవారి సౌకర్యార్థం పని వేళల్లో ప్రభుత్వం బస్సులను నడుపుతుండడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.