యాప్నగరం

తెలంగాణలో మహిళా కమిషన్‌ ఏర్పాటు.. తొలి చైర్ పర్సన్‌‌, సభ్యులు ఎవరంటే..

Telangana: సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు. చైర్ పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు ఉండనుంది.

Samayam Telugu 27 Dec 2020, 10:48 pm
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్ పర్సన్‌తో పాటు మరో 6 మంది సభ్యులను కూడా నియమించారు. సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు. చైర్ పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు ఉండనుంది. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆమె టీఆర్ఎస్‌లో చేరారు.
Samayam Telugu సునీతా లక్ష్మారెడ్డి (ఫైల్ ఫోటో)
sunitha lakshma reddy


ఏపీలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో నన్నపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉండేవారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.