యాప్నగరం

TS 1500 Transaction: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... వారికి ఆర్థిక సాయం లేనట్లే

తెలంగాణ లాక్ డౌన్‌తో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం రూ.1500 అందిస్తోంది. ఆయా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులందరికీ రూ.1500 జమ అవుతాయని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

Samayam Telugu 27 Apr 2020, 9:07 am
తెలంగాణలో కరోనాతో లాక్ డౌన్ విధించింది సర్కార్. దీంతో పేదల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీవారికి సరుకులతో పాటు... రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే చాలామంది తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా సరుకులు తీసుకోవడం లేదని తెలిసింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా కనీసంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండికూడా రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.1,500 సాయాన్ని నిలిపివేసింది.
Samayam Telugu kcr new


అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పౌర సరఫరాల శాఖకు రూ.67 కోట్ల మేర మిగులు వచ్చింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, 3 నెలలుగా రేషన్‌ తీసుకోని కుటుంబాల సంఖ్య ఒక్కో నెల ఒక్కోలా ఉంది. రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.1,500 ఆర్థికసాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. తొలి విడతలో 74లక్షల మందికి, రెండో విడతలో 5.21 లక్షల మందికి పంపిణీ చేస్తోంది. మూడో విడతలో మరో 3లక్షల మందికి రూ.45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

మరో లక్ష కుటుంబాలకి బ్యాంకుల్లో డబ్బులు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 4.50 లక్షలమంది కుటుంబాలు పూర్తిగా రేషన్‌ తీసుకోనివే. వీరికి రూ.1,500 ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్‌ బియ్యం వీరికి అవసరం లేనప్పుడు ప్రభుత్వ సాయం కూడా అనవసరమనే కొందరు పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి కుుటంబాలకు ఆర్థిక సాయం చేయకూడదని నిర్ణయించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.