యాప్నగరం

కరోనా: తెలంగాణ సర్కారు అనూహ్య నిర్ణయం.. కొత్త వేరియంట్లను గుర్తించిన వేళ ఇలానా?

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గత కొన్నాళ్లుగా తక్కువగా నమోదవుతుండటంతో.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వారానికోసారి కరోనా హెల్త్ బులెటిన్ జారీ చేయాలని నిర్ణయించింది.

Samayam Telugu 23 Feb 2021, 6:48 pm
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత మార్చి నెల నుంచి ఆరోగ్య శాఖ రోజువారీ హెల్త్ బులెటిన్‌లను విడుదల చేయగా... ఇక నుంచి వారానికి ఓసారి మాత్రమే కరోనా బులెటిన్ విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1700కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కోవిడ్ బారిన పడి 1625 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు.
Samayam Telugu coronavirus
Representative image


తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కేరళలో కోవిడ్ ఎన్440కే, ఈ484కే వేరియంట్లు ఉన్నాయని గుర్తించారు. కానీ ఈ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఈ వేరియెంట్లే కారణమని భావించలేమని నీతి ఆయోగ్ (ఆరోగ్య) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నూతన వేరియంట్లను గుర్తించినట్లు కేంద్రం చెబుతున్న వేళ.. కేసీఆర్ సర్కారు రోజూ విడుదల చేసే హెల్త్ బులిటెన్‌ను రద్దు చేయడం పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.