యాప్నగరం

JPS Strike: 'రేపు 5 గంటల వరకు విధుల్లో చేరండి.. లేకపోతే..' సర్కారు అల్టిమేటం

సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సమ్మె విరమించి.. ఉద్యోగంలో చేరాలని ఆదేశించింది. ఇందుకోసం డెడ్‌లైన్ కూడా నిర్ణయించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే.. చేరనివాళ్లందరినీ విధుల నుంచి తొలిగిస్తామని నోటీసులు జారీ చేసింది. అయితే.. జేపీఎస్‌లకు సమ్మె చేసే హక్కులేదని.. నిబంధనలు ఉల్లంఘించారని అయినా.. ప్రభుత్వం ఇంకో అవకాశం ఇస్తోందని నోటీసుల్లో తెలిపారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 8 May 2023, 7:42 pm

ప్రధానాంశాలు:

  • జేపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం
  • రేపు సాయంత్రం వరకు విధుల్లో చేరాలని ఆదేశం
  • చేరని వాళ్లందరూ టర్మినేట్ అవుతారని నోటీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jps
జేపీఎస్ సమ్మె
సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (JPS Strike) పై తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. మే 9వ తేదీ అంటే రేపు సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జేపీఎస్ (Junior Panchayat Secretaries) ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ రేపు సాయంత్రంలోపు విధుల్లో చేరకపోతే.. చేరనివాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అయితే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు.

ప్రభుత్వంతో జేపీఎస్‌లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి.. తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సూల్తానియా తెలిపారు. "జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను." అని బాండ్‌లో సంతకం చేశారని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదన్నారు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ.. జేపీఎస్‌లు ఒక యూనియన్‌గా ఏర్పడి.. చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుంచి సమ్మెకు వెళ్లారని తెలిపారు.

నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జేపీఎస్‌లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారని తెలిపిన సుల్తానియా.. ప్రభుత్వం మాత్రం మానవతా దృక్పథంతో జేపీఎస్‌లకు చివరి అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. రేపటిలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారని నోటీసుల్లో స్పష్టం చేశారు.

Gandhi: ఐసీయూలో అమ్మ, ఆకలితో చిన్నారి.. జాడలేని నాన్న, మానవత్వం చాటుకుంటున్న సెక్యూరిటీ
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.