యాప్నగరం

తెలంగాణలో సీన్ రివర్స్.. మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సిద్దిపేటలోని కేసీఆర్ టెట్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పుస్తకాలు, మెటీరియల్స్‌ను ఆయన పంపిణీ చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 15 May 2022, 3:01 pm
తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఎకరా భూమి 5-6 లక్షల రూపాయలు ఉండగా.. ప్రస్తుతం ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కనిష్ఠంగా 20 లక్షల రూపాయలు పలుకుతోందన్నారు. సిద్దిపేటలోని సీఎం కేసీఆర్ టెట్ శిక్షణ కేంద్రంలో టెట్ ఉద్యోగార్థులకు ఆయన పుస్తకాలు, మెటీరియల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu మంత్రి హరీష్ రావు


వంద శాతం టెట్ కోచింగ్ ఫలితాలు రావాలని.. టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4 తో పాటు డీఏస్సీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతరం శిక్షణ-తర్ఫీదు ఉంటుందన్నారు. స్ఫూర్తిదాయకమైన కేసీఆర్ టెట్ శిక్షణా శిబిరంలో శిక్షణార్థులు సీరియస్ నెస్‌తో ఉండాలని సూచించారు. సమయం చాలా విలువైందని.. పోయిన కాలం తిరిగి రాదని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కాలాన్ని, ఈ టెట్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మి.. తెలంగాణ రాష్ట్రంలో భూములు కొనుగోలు చేసేవారని మంత్రి అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైందన్నారు. కొందరు తెలంగాణ వాళ్లు కొంతమంది ఇక్కడ ఎకర భూమి అమ్మి.. ఆంధ్రప్రదేశ్‌లో 5 నుంచి 10 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన గుణాత్మక మార్పు సాధించిందనడానికి ఇదే నిదర్శనమని మంత్రి అన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల నుంచి కూడా కూలీలు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.