యాప్నగరం

కరోనా కేసులపై హైకోర్టు సీరియస్.. వనపర్తి ఘటనలో కీలక ఆదేశాలు

Telangana high court: లాక్ డౌన్ వేళ పోలీసులు అతిగా ప్రవర్తించారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలని, ప్రజలను కొట్టవద్దని డీజీపీ ఆదేశించినట్లుగా వెల్లడించారు.

Samayam Telugu 17 Apr 2020, 8:09 pm
తెలంగాణలో కరోనా వైరస్‌పై దాఖలైన కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండడంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 67 వేల టెస్టింగ్‌ కిట్లే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారనీ.. మరి పెద్ద సంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్లలోని ప్రజలకు ఎలా పరీక్షలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Samayam Telugu telangana high court


Also Read: undefined

పోలీసుల అతి ప్రవర్తన పిటిషన్ పైనా..
మరోవైపు, లాక్ డౌన్ వేళ పోలీసులు అతిగా ప్రవర్తించారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలని, ప్రజలను కొట్టవద్దని డీజీపీ ఆదేశించినట్లుగా వెల్లడించారు. అయితే, పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. అతిగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 24లోపు చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు. వనపర్తిలో ఓ పౌరుడిపై కానిస్టేబుల్ చేయి చేసుకున్న ఘటనలో అతనిపై సస్పెన్షన్‌తో పాటు ఏ చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది.

Also Read: undefined

సర్కారును ఒప్పించండి
విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో 50 శాతం కోతపై దాఖలైన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన వారి పెన్షన్‌లో కోత విధించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోత విధించడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయ పడింది. లాక్ డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించింది. పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం దయగా వ్యవహరించాలని సూచించింది. పూర్తి పెన్షన్ ఇచ్చేలా సర్కారును ఒప్పించాలని ఏజీకి సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.