యాప్నగరం

వాళ్లపై కేసులెందుకు పెట్టలేదు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

Lockdown in Telangana: గుడ్లు, టమాటాలు మినహా నిత్యావసర ధరలన్నీ పెరిగాయని న్యాయసేవాధికార సంస్థ నివేదించింది. ఈ క్రమంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంపై హైకోర్టు విచారం వ్యక్తం చేసింది.

Samayam Telugu 8 May 2020, 7:47 pm
లాక్ డౌన్ సమయంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మాంసం ధరలు విపరీతంగా పెరిగాయని హైకోర్టులో కొద్ది రోజుల క్రితం దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిగింది. ప్రజలు ఆదాయం కోల్పోయిన ఈ సమయంలో ధరలు పెరిగితే నియంత్రించలేరా అంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసింది. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ధరలు అసలు ఎందుకు పెరుగుతాయని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇటువంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 13వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)


Also Read: undefined

పెరిగిన కూరగాయల ధరలపై క్షేత్రస్థాయి నివేదికను న్యాయ సేవాధికార సంస్థ సమర్పించింది. గుడ్లు, టమాటాలు మినహా నిత్యావసర ధరలన్నీ పెరిగాయని న్యాయసేవాధికార సంస్థ నివేదించింది. ఈ క్రమంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంపై హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ధరలు నియంత్రించకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాయన్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిత్యవససర సరకుల ధరలు పెంచిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ధరలు ఎందుకు పెరిగాయని హైకోర్టు ప్రశ్నించింది.

Must Read: ‘6 ఏళ్లుగా క్వారంటైన్‌లోనే కేసీఆర్.. బతికున్నానని చెప్పేందుకే బయటికి..’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.