యాప్నగరం

న్యూ ఇయర్ వేడుకలు: TS సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం.. సీరియస్ కామెంట్స్

New Year 2021: కరోనా విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. కరోనాని దృష్టిలో ఉంచుకుని నూతన సంవత్సర వేడుకలు జరపోదని ముందుగానే ప్రజలకు సూచించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

Samayam Telugu 31 Dec 2020, 1:36 pm
నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీడియాలో వచ్చిన కథనాలను చూసి సుమోటోగా హైకోర్టు విచారించింది. ఒక వైపు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కొత్త వైరస్ బాగా డేంజర్ అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. న్యూ ఇయర్ వేడుకలకు పబ్‌లు, బార్‌లు విచ్చలవిడిగా తెరిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రభుత్వానికి అర్థమవుతుందా అసలు ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


నూతన సంవత్సరం వేడుకలను రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే బ్యాన్ చేశారని, అసలే కొత్త వైరస్ పేరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న ఇటువంటి సమయంలో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది.

కరోనాని దృష్టిలో ఉంచుకుని నూతన సంవత్సర వేడుకలు జరపోదని ముందుగానే ప్రజలకు సూచించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించాలని హైకోర్టు సూచించింది. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి7 న సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.