యాప్నగరం

కొవిడ్ విజృంభణ: హైకోర్టు కీలక నిర్ణయం.. విచారణలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే..

Telangana High Court: కొవిడ్ కారణంగా ఆన్‌లైన్ ద్వారా విచారణ జరిపే విధానం వెంటనే అమల్లోకి వస్తుందని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు.

Samayam Telugu 15 Apr 2021, 11:52 pm

ప్రధానాంశాలు:

  • హైకోర్టుపై కూడా కొవిడ్ ఎఫెక్ట్
  • ఇక అన్ని విచారణలు వర్చువల్ విధానంలోనే..
  • ఉత్తర్వులు విడుదల చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ హైకోర్టులో కేసుల విచారణలు ఇక మీదట పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం కొన్ని బెంచ్‌లు ఆన్‌లైన్‌లో, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని బెంచ్‌లు ఆన్‌లైన్‌లోనే విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు పాక్షికంగా ప్రత్యక్ష విచారణ విధానం రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
కొవిడ్ కారణంగా ఆన్‌లైన్ ద్వారా విచారణ జరిపే విధానం వెంటనే అమల్లోకి వస్తుందని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇక సింగిల్, డివిజన్ బెంచ్‌లు సహా లార్జ్ బెంచ్‌లు సైతం వర్చువల్ విధానంలోనే విచారణ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.