యాప్నగరం

‘జీతాలిచ్చేది నిద్రపోవడానికా.. హైదరాబాద్‌ను అలా చూస్తే బాధేస్తోంది’

హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతూంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇలాంటి నిర్మాణాలను తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తూ ఇద్దరు పౌరులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్చి 24న జరిగే విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 29 Feb 2020, 1:20 pm
హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతూంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇలాంటి నిర్మాణాలను తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తూ ఇద్దరు పౌరులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్చి 24న జరిగే విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu telangana high court fires on ghmc over illegal constructions
‘జీతాలిచ్చేది నిద్రపోవడానికా.. హైదరాబాద్‌ను అలా చూస్తే బాధేస్తోంది’


‘అదే కొనసాగితే కమిషనర్‌ను సాగనంపాల్సి వస్తుంది’

అక్రమ నిర్మాణాలపట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును ధర్మాసనం ఆక్షేపించింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను విచ్చల విడిగా ఆక్రమించిన కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సాగనంపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు.

‘నిద్రపోయేందుకు కాదు జీతాలు’

అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సిబ్బంది కళ్లు మూసుకొని ఉండకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి అక్రమాలు చూస్తూ నిద్రపోయేందుకు మీకు జీతాలు చెల్లించడం లేదని ఆక్షేపించింది. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లకోసారి తన విధానాలను సవరిస్తూ అక్రమ నిర్మాణాలు క్రమబద్ధీకరించేందుకు వేర్వేరు జీవోలు జారీచేస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడింది. ‘‘మీ విధులు మీరు నిర్వర్తించాలి. లేనిపక్షంలో కోర్టే వాటిని చేపడుతుంది. తర్వాత ఉద్యోగుల పట్ల కోర్టు కఠినంగా వ్యవహరించిందని బాధపడవద్దు’’ అని పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులను హెచ్చరించింది.

‘జీహెచ్ఎంసీ కళ్లు తెరవాలి’

ఆక్రమణలలో నరకానికి నకలుగా మారిన పట్నా, ముంబయి నగరాల్లా హైదరాబాద్ మారిపోక ముందే జీహెచ్ఎంసీ కళ్లు తెరవాలని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు భూములు ఆక్రమణలు చేయడం, ఆపై సంబంధిత చట్టాలను రెగ్యులరైజ్‌ చేయడం వంటివి ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. నగరాన్ని ఇలాగే వదిలేస్తే నరకమైపోతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలను నిలువరించడానికి జీహెచ్‌ఎంసీలో ఎలాంటి విభాగం లేనట్లుందని వ్యాఖ్యానించింది.

Must Read: చిరంజీవి ఇంటి వద్ద అభిమానుల హంగామా.. పోలీసుల భారీ భద్రత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.