యాప్నగరం

కేసీఆర్ ఆరోగ్య స్థితిపై పిటిషన్: పొలిటికల్ జిమ్మిక్కులు చేయొద్దు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Telangana High Court: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బయటకు ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్ వేశారు. అయితే, దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Samayam Telugu 10 Jul 2020, 3:00 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు వారాలుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వేళ ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ఆయన ఉన్నట్టుండి కనిపించకపోయేసరికి కరోనా సోకిందేమో అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బయటకు ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Telangana high court kcr


రాజకీయపరమైన జిమ్మిక్కులు చేస్తే సరికాదని పిటిషనర్‌ను తీవ్రంగా హెచ్చరించింది. సీఎం కేసీఆర్ కనిపించకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కొద్ది రోజులుగా కేసీఆర్ కనిపించనందున ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో జులై 8న మాండమస్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్ వేశారు. ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.