యాప్నగరం

ఓయూలో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్‌కు చుక్కెదురు..?

ఓయూలో రాహుల్ పర్యటనకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించినట్లు సమాచారం.

Authored byAshok Krindinti | Samayam Telugu 4 May 2022, 9:15 pm
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓయూ పర్యటనకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. రాహుల్ ఓయూ పర్యటనపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించినట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలు వినేందుకు ఓయూకు రాహుల్ గాంధీ వస్తున్నారని.. కాంగ్రెస్ నేతల తరపున న్యాయవాది వాదించారు. గతంలో చాలా పార్టీలు ఓయూలో మీటింగ్స్ జరిపాయని.. ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లు సమాచారం.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు


ఈ నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న సంగతి తెలిసిందే. అదే రోజు వరంగల్‌లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు రానున్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య పప్పుల లక్ష్మీనారాయణ అనుమతి ఇవ్వలేదు. దీంతో తెలంగాణ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. వీసీదే తుది నిర్ణయమని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీసీకి మరోసారి దరఖాస్తు చేసుకున్నా.. అనుమతి రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.