యాప్నగరం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Srinivas Goud Murder Conspiracy Case: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి నమోదైన ప్రైవేటు ఫిర్యాదుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, హైదరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు 17 మంది పోలీసులపై మహబూబ్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో దాఖలైన ఫిర్యాదుపై.. పోలీసులకు సమన్లు జారీ అయ్యాయి. వాటిని సవాల్ చేస్తూ.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Sep 2022, 11:16 am
Srinivas Goud Murder Conspiracy Case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి నమోదైన ప్రైవేటు ఫిర్యాదుపై హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీతో సహా 17 మంది పోలీసులపై కింది కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్‌కు చెందిన బి.విశ్వనాథ్‌, సి.రాఘవేంద్రరాజును అక్రమంగా కిడ్నాప్‌ చేసి నిర్బంధించారంటూ విశ్వనాథ్‌ భార్య పుష్పలత.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, హైదరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు 17 మంది పోలీసులపై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
Samayam Telugu srinivas goud
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు


ఈ ఫిర్యాదుపై విచారించిన మహబూబ్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు.. పోలీసులకు సమన్లు జారీ చేసింది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా జిల్లా కోర్టులో నమోదైన కేసును కొట్టివేయాలంటూ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు పోలీసులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. కింది కోర్టులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.

ఎలా మొదలైందంటే..

ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో నలుగురి కిడ్నాప్ అంటూ మొదలైన వ్యవహారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రగా తేలింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర చేశారంటూ పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నారని.. అయితే వారితో తేడాలు రావడంతో సుపారీ గ్యాంగ్ సభ్యుడు ఫరూక్ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనను హత్య చేసేందుకు ముగ్గురు ప్రయత్నించారని ఫరూక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫరూక్‌ని వెంటాడి హతమార్చేందుకు ప్రయత్నించిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ని అరెస్టు చేయడంతో మంత్రి హత్యకు కుట్ర వ్యవహారం బయటికొచ్చిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు, ఆయన సోదరులు, ఇతరులను అరెస్ట్ చేశారు. వేధింపులు భరించలేకే శ్రీనివాస్ గౌడ్‌ను చంపేయాలని కుట్ర పన్నినట్లుగా నిందితులు విచారణలో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. గతేడాది ఆగస్ట్ 3వ తేదీన రాఘవేందర్ రాజు ఇంట్లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేశారని, అక్కడ కుదరకపోతే మహబూబ్‌నగర్‌లో ఎక్కడ హత్య చేయాలనే దానిపై కూడా నిందితులు పక్కా స్కెచ్ వేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను కూడా హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో రూ.15 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.