యాప్నగరం

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు అత్యవసర విచారణ.. కీలక ఆదేశాలు

Shadnagar ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టే వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది.

Samayam Telugu 6 Dec 2019, 10:58 pm
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షాద్‌నగర్ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ కేసు నిందితులు ఆరిఫ్‌, నవీన్‌, చెన్నకేశవులు, శివ మృతదేహాలను డిసెంబర్ 9 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు కేసు విచారణను చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది.
Samayam Telugu High Court


మృతదేహాల పోస్టుమార్టం వీడియోలను జిల్లా జడ్జికు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియల ప్రక్రియ ఆగిపోయింది. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను భద్రపరిచారు.

Watch: ఎన్‌కౌంటర్ స్థలంలో దిశ నిందితుల మృతదేహాలు..

హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకెట్ జనరల్ బీఎన్ ప్రసాద్ హాజరయ్యారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో చిత్రీకరించినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు డిసెంబర్ 9న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఎన్‌కౌంటర్‌పై హౌస్‌ మోషన్‌ పిల్‌ ఆధారంగా హైకోర్టు స్పందించింది.

మరోవైపు.. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో దిశ కేసు నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: స్ట్రిక్ట్ ఆఫీసర్.. కానీ, ఫ్యామిలీ మ్యానే: సజ్జనార్ కుటుంబం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.