యాప్నగరం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Shadnagar Encounter ఘటనపై దాఖలైన పటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. దిశ కేసు నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని.. శుక్రవారం వరకు భద్రపరచాలని ఆదేశించింది.

Samayam Telugu 9 Dec 2019, 4:13 pm
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం (డిసెంబర్ 9) విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ కేసు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని.. అవి డీకంపోజ్ కాకుండా తరలింపు కోసం ఎయిర్ కండీషన్డ్ అంబులెన్స్‌ను వినియోగించాలని సూచించింది. నిందితుల మృతదేహాలు ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని ఏజీని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Samayam Telugu High Court


ఈ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ పాటిస్తే దానికి ఆధారాలు చూపాలని ఏజీ (అడ్వొకెట్ జనరల్)ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకెట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.

Also Read: హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీస్.. అసెంబ్లీలో సీఎం జగన్

ఎన్‌కౌంటర్‌పై మరో పిటిషన్‌ దాఖలు కావడంతో.. మధ్యాహ్నం 2:30 గంటలకు రెండు పిటిషన్లు కలిపి హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌లో చంపారని పలువురు మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా ప్రకటించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ పిల్ దాఖలైంది. ఈ కేసు విచారణను బుధవారం చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.