యాప్నగరం

Hyderabad Election: ఈసీకి హైకోర్టు షాక్.. సర్క్యూలర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

బ్యాెలట్ పేపర్‌పై పెన్నుతో టిక్ పెట్టిన కూడా ఓటు వేసినట్లే పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యూలర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

Samayam Telugu 4 Dec 2020, 12:45 pm
తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పెన్నుతో టిక్ పెట్టిన ఓటు వేసినట్లే అంటూ ఎస్ఈసీ సర్య్కూలర్ జారీ చేసింది. దీంతో ఈ సర్క్యూలర్‌పై బీజేపీ కోర్టుకెక్కింది. అయితే ఆ సర్క్యూలర్ చెల్లదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లను మాత్రమే లెక్కించాలని ఆదేశించింది. ఈసీ ఇచ్చిన సర్క్యూలర్ పై బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈసీ ఆదేశలు చెల్లవని స్పష్టం చేసింది. ఎస్ఈసీ సర్క్యూలర్‌ను సస్పెండ్ చేసింది.
Samayam Telugu ఈసీకి హైకోర్టు షాక్


Read More: Hyderabad Election Results 2020: పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్
అంతేకాకుండా జీహెచ్ంఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.