యాప్నగరం

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట కలెక్టర్‌కు మెదక్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతల్ని అప్పగించింది.

Samayam Telugu 14 Nov 2020, 7:44 am
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతల్నీ అప్పగించింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్ రామిరెడ్డికి మెదక్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతల్ని అప్పగించింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోళికెరి పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. సంగారెడ్డి కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతికి అదనపు బాధ్యతల్ని అప్పగించింది.
Samayam Telugu ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు


అయితే నాలుగు రోజుల క్రితమే ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌లు బదిలీ అయ్యారు. అంతకుముందు,మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరిని ప్రభుత్వం సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేసింది.ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు మంచిర్యాల కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Read More:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారు.. గోరేటి వెంకన్నకు ఛాన్స్

ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం భారీగా కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఐఏఎస్‌ల బదిలీ జరగడం అదే తొలిసారి. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించగా.. కీలకమైన శాఖల్లో అధికారులను మార్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఐఏఎస్ అధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.