యాప్నగరం

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సిలబస్‌ తగ్గింపు

Telangana Inter Board: సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కుదించిన సిలబస్‌ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Samayam Telugu 22 Sep 2020, 9:43 pm
కరోనా పరిస్థితులతో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్‌ సిలబస్‌లో మార్పులు చేసింది. అంతేకాక, ఈ విద్యా సంవత్సరం జీరో ఇయర్‌‌గా మిగిలిపోకుండా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. కేంద్రం, సీబీఎస్‌ఈ సూచనల మేరకు పాఠ్యాంశాలను కుదించింది. ఈ మేరకు సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కుదించిన సిలబస్‌ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana inter board


సైన్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ తొలగించిన పాఠాలను కుదించినట్లు జలీల్‌ చెప్పారు. హ్యుమానిటీస్‌, మొదటి, రెండో లాంగ్వేజీల్లో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 30 శాతం కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం తెలుగు సిలబస్‌ను సవరించామని.. రెండో సంవత్సరం చరిత్ర, అర్థశాస్త్రం, పౌర శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌ సిలబస్‌లో మార్పులు చేసినట్లు ఉమర్ జలీల్‌ వివరించారు. అయితే, ఇలా కుదించిన సిలబస్‌ ఈ ఏడాదికి మాత్రమే పరిమితం అని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.