తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కంచిలో 40ఏళ్లకోసారి దర్శనమిచ్చే అతివరదర్ స్వామి వారిని కేసీఆర్ ఈరోజు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు.
జనసంద్రాన్ని తలపిస్తోన్న కంచి
అత్తివరదర్ స్వామి ఆగస్టు 17వరకు మాత్రమే దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన్న చూసి తరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో కంచి పట్టణం పదిరోజులుగా కిక్కిరిసిపోతోంది. స్థానికులు బయటకు వచ్చి పనులు చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు. దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆలయం వద్ద పార్కింగ్ ప్రాంతం నిండిపోవడంతో ఇతర వాహనాలను అనుమతించడం లేదు.